మళ్లీ వందేభారత్ పై రాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం

Stones Pelted At Vande Bharat Train In Agra

న్యూఢిల్లీః వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. ఆగ్రా రైల్వే డివిజన్ లోని భోపాల్ నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ వరకు నడుస్తున్న వందేభారత్ రైలుపై బుధవారం కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. మానియా-జజౌ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ దాడిలో C-7 కోచ్‌లోని సీట్ నంబర్ 13-14 కిటికీ అద్దాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే బృందం ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టింది.