శ్రీవారి హుండీ ఆదాయం రూ.కోటి
నిన్న అత్యధిక సంఖ్యలో శ్రీవారి దర్శనం
తిరుపతి: తిరుమలలో కొన్ని వారాల కిందట దర్శనాలు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో, తిరుమల వెంకన్న సన్నిధి పునఃప్రారంభం తర్వాత నిన్న రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఆదివారం హుండీ ద్వారా రూ.1 కోటి 2 లక్షలు ఆదాయం వచ్చినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, పునఃప్రారంభం తర్వాత అత్యధికంగా నిన్న స్వామివారిని 13,486 మంది దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకటేశ్వరుడి దర్శనాలను పరిమితం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/