అనుపమ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన ధమాకా బ్యూటీ

ధమాకా బ్యూటీ శ్రీలీల..గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని , అనుపమ కు ఛాలెంజ్ విసిరింది. బిఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు లభించింది. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ మొక్కలు నాటుతూ..మరికొంతమందికి ఈ ఛాలెంజ్ ని విసురుతున్నారు. సినీ , రాజకీయ, బిజినెస్ ఇలా అనేక రంగాల వారు ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం జరిగింది. తాజాగా ప్రముఖ సినీ నటి శ్రీలీల ఈ ఛాలెంజ్ లో పాల్గొంది.

గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హస్పిటాలిటీలో ఆమె విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీల అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా హీరోయిన్స్ శాన్వి శ్రీవాస్తావ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు తన అభిమానులు మూడు మొక్కలను నాటాలని శ్రీలీల పిలుపు ఇచ్చారు.