రేపు హైదరాబాద్ సీబీఐ కోర్టు కు వివేకా హత్య కేసు నిందితులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను రేపు శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఈ కేసులో మొతం ఐదుగురు నిందితులు ఉండగా..వారంతా కడప సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్నారు. సునీల్ యాదవ్, ఉమాశంక‌ర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు ఇదే కేసులో బెయిలుపై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి మొదటి సారి సీబీఐ కోర్టు ముందుకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిని నేడు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ప్రత్యేక రక్షణ మధ్య వీరిని హైదరాబాద్ తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. వీరిని హైదరాబాద్ తరలించేందుకు వీలుగా కడప జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్, బెయిలుపై ఉన్న ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు జారీ అయ్యాయి.

2019లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టుతీర్పు ఇవ్వడం జరిగింది. ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు సాగుతున్న తీరు, దర్యాప్తు అధికారులకు రాజకీయ బెదిరింపులు, వివేకా కుమార్తె విజ్ఞప్తి వంటి పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.