కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను విడుదల చేసింది. జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని బహిరంగ సభలో ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

త్వరలోనే ఆగమశాస్త్రం ప్రకారం.. దేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు. కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ అన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో కొండగట్టు దశ,దిశ మారనుందని ఆయన అన్నారు.