భక్తులకు తీపి కబురు : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపబోతున్నట్లు తెలిపింది. డిసెంబర్‌, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది.

సికింద్రాబాద్ – కొట్టాయం (6 సర్వీసులు): 07125 నంబర్‌ గల రైలు డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 (ఆదివారాలు) సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు కొట్టాయం చేరుకుంటుంది.

కొట్టాయం – సికింద్రాబాద్ (6 సర్వీసులు): 07126 నంబర్‌ గల రైలు కొట్టాయం నుంచి డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 (సోమవారాలు)లలో బయలుదేరి మరుసటి రోజు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, కోయంబత్తూరు, తిరుప్పూర్, కోయంబత్తూరు, అలువా ఎర్నాకులం టౌన్‌ స్టేషనల్లో ఆగుతాయి.

నర్సాపూర్ – కొట్టాయం (6 సర్వీసులు): 07119 గల రైలు సర్వీసు డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 (శుక్రవారాలు) నర్సాపూర్ నుండి బయలుదేరి మరుసటి రోజు కొట్టాయం చేరుకుంటుంది.

కొట్టాయం – నరసాపూర్ (6 సర్వీసులు): 07120 నంబర్‌ రైలు కొట్టాయం నుండి డిసెంబరు 3, 10, 17 31, జనవరి 7, 14 (శనివారం) తేదీలలో బయలుదేరి మరుసటి రోజు నర్సాపూర్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, కోయంబత్తూరు, కోయంబత్తూరు, కోయంబత్తూరు, తిరుప్‌పూర్‌, తిరుప్‌పూర్‌, తిరుప్‌పూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి.

హైదరాబాద్ – కొల్లాం (7 సర్వీసులు): 07133 నంబర్‌ గల రైలు డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 ,16 (సోమవారాలు) తేదీలలో హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటుంది.


కొల్లాం – హైదరాబాద్ (7 సర్వీసులు): 07134 నంబర్ గల ట్రైన్‌ డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 (మంగళవారం) తేదీలలో కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్‌, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనచేరి, తిరువళ్ల, చెంగన్నూరు, మావేలికెర, కాయంకుళం, సస్తాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది.