ఆర్ఆర్బీ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక రైళ్లు
అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరిన రైల్వే

హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ఎన్టీపీసీ సీబీటీ 2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆ రోజు వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
నేడు తిరుపతి-సేలం, సేలం-తిరుపతి, 12న తిరుపతి-సేలం, 13న సేలం-తిరుపతి, 13న షాలిమార్-సికింద్రాబాద్, 14న షాలిమార్-సికింద్రాబాద్, 16న సికింద్రాబాద్-షాలిమార్, 17న సికింద్రాబాద్-షాలిమార్ రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/