శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు

శ్రీవారి సంపదపై పాలకుల కన్నుపడింది.. సోము వీర్రాజు

somu veerraju

తిరుమల: ఈరోజు ఉదయం పార్టీ నేతలతో కలిసి ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేలా రాష్ట్రంలోని పాలకులకు జ్ఞానాన్ని ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు. అలాగే, ఏపి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీవారి సంపదపై ప్రభుత్వం కన్నుపడిందని అన్నారు. స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకలు సహా ప్రతీ రూపాయిని ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/