నార్సింగి లో విషాదం : జాబ్ ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో విషాదం చోటుచేసుకుంది. జాబ్ ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పుప్పాల్ గూడ లో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా వాసి వినోద్ కుమార్ ..హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా కంపెనీలో తీవ్ర ఒత్తిడి ఉంది. దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు.

తన ఉద్యోగం పోవటం ఖాయమనే అభిప్రాయానికి వచ్చాడు. దీనికితోడు ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు లేఆఫ్ లు ప్రకటిస్తుండే సరికి, వినోద్ కు కూడా తన జాబ్ పై నమ్మకం పోయింది. ఆందోళన ఎక్కువైంది. కొంతకాలంగా డిప్రెషన్ లో ఉంటున్న వినోద్ తన గదిలో నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. వినోద్ మరణ వార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఐదేళ్ల క్రితమే వినోద్ కు పెళ్లైంది. ఇప్పటివరకు తన వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.