శృతిహాసన్ ను వెంటాడుతున్న అనారోగ్యం

కమల్ హాసన్ కూతురి గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్..కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని కాస్త ఇబ్బంది పడింది. ఆ తరవాత గబ్బర్ సింగ్ మూవీ తో ఆమె జతకమే మారిపోయింది. గబ్బర్ సింగ్ తర్వాత వరుస విజయాలు , అగ్ర హీరోల సరసన నటించే ఛాన్సులు రావడం తో ఆమె ఫుల్ బిజీ గా మారింది. తాజాగా ఈమె నటించిన వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు విజయాలతో శృతి మరింత బిజీ కావడం ఖాయం.

ఇదిలా ఉంటె ఈ మధ్య వరుసగా హీరోయిన్లు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా శృతి హాసన్ కూడా అనారోగ్య సమస్య తో బాధపడుతున్నట్లు స్వయంగా ఆమెనే తెలిపింది. చిన్న చిన్న విషయాలకు కూడా సహనాన్ని కోల్పోయి.. విపరీతమైన కోపంతో రగిలిపోతాను.. ఈ విషయంలో నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కావడం లేదు. మొదట ఈ విషయాన్ని బయట చెప్పకూడదనుకున్నాను. ఎవరు ఏమనుకుంటారో అని భయపడ్డాను. దాన్ని కూడా నా యొక్క మానసిక రుగ్మతగానే అనిపించింది. అందుకే నేను ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అంటూ తెలిపింది.

ప్రస్తుతం తాను మానసిక పరిస్థితికి చికిత్స తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. కోపాన్ని తగ్గించుకోవడానికి పాటలు వింటున్నాను అని కూడా తెలిపింది. అనుకున్నది జరగకుండా అటు ఇటు అయితే మాత్రం షూటింగ్ సెట్ లో లేదా మరి ఎక్కడైనా సరే విపరీతమైన కోపం వస్తుందట. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే ఇలా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.