తిరిగి బిఆర్ఎస్లోకి పొంగులేటి ముఖ్య అనుచరుడు
భద్రాచలం అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యమని వ్యాఖ్య
హైదరాబాద్ః పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి బిఆర్ఎస్ లో చేరబోతున్నారు. బిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెంకట్రావు తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యమని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు. గతంలో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తాను కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని చెప్పారు. పొంగులేటి ప్రధాన అనుచరుడిగానే తాను కాంగ్రెస్ లో చేరానని.. అయితే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక మళ్లీ బిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తనతో పాటు వచ్చిన కార్యకర్తలకు కూడా బిఆర్ఎస్ లో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే బిఆర్ఎస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.