మేనల్లుడి పెళ్లికి సీఎం జగన్ గైర్హాజరు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొడుకు పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఉండే ఓ ప్యాలెస్లో రాజారెడ్డి ప్రియ వివాహం జరిగింది. ఈ పెళ్లికి షర్మిల దంపతులు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్. అంబానీ, అదానీ లాంటి సంపన్నుల పెళ్లిళ్లు జరిగే ఈ ప్యాలెస్ను.. తన కొడుకు పెళ్లి కోసం బుక్ చేశారు షర్మిల. తమ రేంజ్కు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు కూడా చేశారు.
పెద్దమొత్తంలో ఖర్చుపెట్టి కొడుకు పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా చేశారు. స్నేహితులు, బంధుమిత్రుల మధ్య రాజారెడ్డి పెళ్లిలో కనిపించిన లవ్లీ సీన్స్ అన్నీ ఇన్నీ కాదు. కానీ అంతా పెళ్లికి వచ్చినా జగన్ లేని లోటు పెళ్లిలో చాలా క్లియర్గా కనిపించింది. ఈపెళ్లికి ఏపీ సీఎం జగన్ హాజరుకాకపోవడం గమనార్హం. రాజకీయంగా జగన్ ఫై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ రాలేదా లేక బీజీగా ఉండి వెళ్లలేదా అన్న ఆసక్తికర చర్చ రాష్ట్ర రాజకీయవర్గాల్లో నడుస్తోంది.