జూలై నుండి అంతర్జాతీయ విమనాలు ప్రారంభం!
ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా అంతర్జాతీయ విమానాల సర్వీస్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం జూలై నుంచి తిరిగి పునరుద్ధరించాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వచ్చేనెల నుంచి విదేశాలకు విమాన సేవలు మళ్లీ ప్రారంభించే అవకాశముందని విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాలను పాటిస్తూ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించనున్నారు. కాగా, కరోనా లాక్డౌన్తో విమానయాన రంగం కుదేలైపోయింది. విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం మొదట ఎయిర్ ఇండియా, ఆ తర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/