‘సమ్మక్క సారక్క’ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం

ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీ ములుగు జిల్లాలో ఏర్పాటు కానుంది.

ఈ యూనివర్సిటీ ఏర్పాటు కోసం సంబంధిత బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విశ్వవిద్యాలయం కోసం రూ. 889.07 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు సమాచారం. అక్టోబర్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

యూనివర్సిటీ ఏర్పుటుకు స్ఠలం కోసం ములుగు సమీపంలో 200 ఎకరాలు గతంలోనే కేటాయించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా కేటాయించిన స్థలాన్ని పరిశీలించి యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని తెలిపారు.