ఏపీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన జగన్ సర్కార్

ఏపీ సర్కార్..రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ గురువారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వీటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనున్నట్లు తెలిపారు.

నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.