మధ్యాహ్న భోజన కార్మికులకు తీపి కబురు తెలిపిన సీఎం కేసీఆర్

మధ్యాహ్న భోజన కార్మికులకు తీపి కబురు తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 54231 మంది బుక్ కం హెల్పర్లు గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి మూడు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 1,760 మధ్యాహ్న భోజన ఏజన్సీ నిర్మాహకులకు ప్రయోజనం చేకూరనున్నది. రాష్ట్రంలో 27 వేల పైచిలుకు పాఠశాలలు ఉండగా… 34 వేలకు పైగా ప్రాథమిక స్కూళ్లు ఉన్నాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోందని.. ఈ విషయాన్ని ఆర్బీఐ చెబుతోందన్నారు.

ప్రభుత్వ పథకాలు లబ్ది దారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగామని పేర్కొన్నారు. అటు పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం ప్రకటించింది. నియోజకవర్గంలో 2వేల మందికి 3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మరోపక్క మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.