నడిరోడ్డుపై యువతీ డాన్స్ చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందన

ఇటీవల కాలంలో యువత సోషల్ మీడియా కు బాగా అలవాటుపడ్డారు. ఎలాగైనా పాపులర్ కావాలనే తపనతో ఏదిపడితే అది చేస్తూ పాపులర్ కావడం కాదు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం , వివాదంలో చిక్కుకోవడం చేస్తున్నారు. తాజాగా ఓ యువతీ ఇలాగే పాపులర్ కావాలని చెప్పి నడిరోడ్డు ఫై డాన్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ వీడియో ఫై తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు.

‘‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాప్యులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో.. ఏమో!?’’ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.