హైదరాబాద్‌లో మరో దారుణం..కుక్కల దాడిలో బాలుడు మృతి

హైదరాబాద్ లో విధి కుక్కల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొద్దీ నెలల క్రితం పెద్ద అంబర్ పేట్ లో నాలుగేళ్ళ చిన్నారి ఫై కుక్కలు దాడి చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపగా..ఆ తర్వాత కూడా ఈ తరహా దాడులు జరుగుతుంది ఉన్నాయి. తాజాగా మరోసారి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన షేక్‌పేటలో చోటుచేసుకుంది.

17 రోజుల క్రితం పడుకున్న ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపరచగా..వెంటనే అప్రత్తమైన తల్లిదండ్రులు ఆ బాబును ఆసుపత్రిలో చేర్చించారు. 17 రోజులుగా చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. కళ్ల ముందే కదలాడే కుమారుడు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.