జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​పై మంత్రి రోజా సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మరోసారి సెటైర్లు వేశారు మంత్రి రోజా. జనసేన పార్టీ అసలు ఎందుకు పెట్టారో పవన్ కళ్యాణ్ కే తెలియాలనన్నారు. రాజకీయాల్లో ఎవరైనా తన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారని.. కానీ పవన్ మాత్రం..మరొకరి జెండా మోయడానికి పార్టీ పెట్టారని రోజా ఆరోపించారు. పవన్ ఎప్పుడూ టీడీపీ, బీజేపీ జెండా మోస్తూ వారికే ఓటు వేయాలని కోరతారని ఎద్దేవా చేసారు.

ప్రస్తుతం పవన్ మోయాల్సిన జెండా ఏదైనా మిగిలింది అంటే.. అది కేఏ పాల్ జెండా మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో అది కూడా పవన్ మోసేస్తే గిన్నిస్ బుక్ ఎక్కేయ్యచ్చు అని సెటైర్లు వేశారు. తన పార్టీకి ఓటేయకుండా.. ప్యాకేజీల కోసం పక్క పార్టీకి ఓటేయండి అని పిలిచే పవన్ వెనుక ఇంకా ఆ పార్టీ వారు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం రోజా చేసిన వ్యాఖ్యల ఫై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.