మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : పెళ్లికి వెళ్తుండగా నదిలో పడిన మినీట్రక్కు

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.: పెళ్లికి వెళ్తుండగా మినీట్రక్కు నదిలో పడిన ఘటన లో 12 మంది మరణించారు. దతియా జిల్లాలో బుధువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. గ్వాలియర్​కు బిల్​హెటి గ్రామానికి చెందిన ప్రజలు.. టికంగఢ్​లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓ మినీ ట్రక్కులో వెళ్తున్నారు.

బుహరా గ్రామంలోని వంతెన వద్దకు రాగానే అదుపుతప్పి మినీట్రక్కు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, మరో 30 మంది వరకు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా వధువును తీసుకుని పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. దీంతో పెళ్లి జరగాల్సిన వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.