ఏపీలో కరోనా విలయం
14, 986 పాజిటివ్ కేసులు నమోదు
![corona tests](https://www.vaartha.com/wp-content/uploads/2021/05/corona-tests-3-1024x583.jpg)
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతూ ఉంది. రోజుకు 15 వేల చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 60,124 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 14, 986 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 84 మంది మృతి చెందారు. వివిధ జిల్లాల్లో కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,352, విశాఖలో 1,618, చిత్తూరులో 1,543, గుంటూరులో 1,575, కడపలో 1,224 కేసులు నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/