చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా అక్టోబరు 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్షః అచ్చెన్న

అదే రోజున కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు మద్దతు తెలపాలని పిలుపు

atchannaidu

హైదరాబాద్‌ః టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అక్టోబరు 2న గాంధీజయంతి నాడు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. అదే రోజున (అక్టోబరు 2) రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లోనూ లైట్లు ఆపేసి బయటికి వచ్చి కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

నంద్యాలలో ఈరోజు టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలను తట్టుకోలేక 97 మంది చనిపోయినట్టు తెలిసిందని, వారి మరణం పట్ల ఈ సమావేశంలో సంతాపం తెలిపామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. త్వరలోనే టిడిపి, జనసేన జేఏసీ రూపుదిద్దుకుంటుందని, ఇక పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.