పోస్ట్ పెయిన్ వినియోగదారులకు జియో షాక్

ప్రముఖ టెలికం సంస్థ జియో తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. టెలికం రంగంలో అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే జియో అగ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఫ్రీ కాల్స్ అంటూ కోట్లాదిమంది వినియోగదారులను రాబట్టుకున్న జియో..ఆ తర్వాత చార్జీల మోత మోగించడం మొదలుపెట్టింది. ఇప్పటికే అనేకసార్లు ప్లాన్ ధరలను పెంచిన జియో..తాజాగా పోస్ట్ పెయిన్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. రూ. 199ప్లాన్ ధరపై ఏకంగా రూ. 100 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 299గా మారింది.

గతంలో రూ. 199 ప్రకారం..వినియోగదారులు ఈ ప్లాన్‌లో 25GB డేటాను పొందేవారు. ఇక ఇప్పుడు ధర రూ.299 తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 25 జీబీ డేటా కు బదులు..30 జీబీ డేటా లభిస్తుంది. ఈ 30 జీబీ డేటా ముగిసిన తర్వాత కస్టమర్లు..ఒక్కో జీబీకి రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు ఉచితంగా 100 SMSలను పొందుతారు. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్ , JioTV, Jio సినిమా, Jio సెక్యూరిటీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందుతారు.