అమిత్ షా కు ఘన స్వాగతం పలికిన జగన్
మూడు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి కి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాక్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్షా, వైఎస్ జగన్ తిరుమలకు చేరుకున్నారు. వారికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి ఘన స్వాగతం పలికారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, మేయర్ శిరీష స్వాగతం పలికారు.
అమిత్ షా టూర్ విశేషాలకు వస్తే..(ఆదివారం) మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం నుంచి తిరుపతి పయనమవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అమిత్ షా అధ్యక్షతన తిరుపతి తాజ్ హోటల్లో జరిగే దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఢిల్లీకి పయనమవుతారు.