తెలంగాణలో కొత్తగా 2,817 కేసులు నమోదు

లక్ష దాటిన డిశ్చార్జి కేసులు

corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,817 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,611 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,537 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,00,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 856కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 452 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/