రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి డెడ్‌లైన్ ప్రకటన

రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి డెడ్‌లైన్ ప్రకటించింది తెలంగాణ పౌరసరఫరాల శాఖ. జనవరి 31 లోపు ఈ-కేవైసీ చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అప్రమత్తం చేశారు.

శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ 70.80 శాతం పూర్తయ్యిందని వెల్లడించారు. 87.81 శాతం నమోదుతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ప్రథమ స్థానంలో, అతి తక్కువగా 54.17 శాతంతో వనపర్తి జిల్లా చివరి స్థానాల్లో నిలిచాయని ఉత్తర్వుల్లో తెలిపారు. రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును చౌకధరల దుకాణాల్లో డీలర్లు సేకరిస్తున్నారు.