ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.55 లక్షలు అందించిన పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.55 లక్షలు అందించారు. కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 11 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారు.

ఆయా కార్యకర్తల మృతికి దారితీసిన కారణాలు తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు. జనసేన అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉండాలన్న ఆలోచనతోనే పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా చేయించామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పారు.