కొత్త ఏడాది రోజే ప్రయోగానికి సిద్దమైన ఇస్రో

చంద్రుడి ఫై కాలుమోపి రికార్డు నెలకొల్పిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించనుంది. ఈఏడాది చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 మిషన్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత విజయపతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించింది. ఇక ఇప్పుడు కొత్త ఏడాది మొదటి రోజే మరో ప్రయోగానికి సిద్ధమైంది.

పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ దిశగా శనివారం ప్రయోగ సన్నద్ధతపై లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు జరిగాయి.

ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభయ్యే కౌంట్ డౌన్ సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈమారు ఎక్స్-రే‌తో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. ఈమారు ఎక్స్‌పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్‌లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.