యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ కన్నుమూశారు. ఈ విషయాన్నీ రష్మీ తన సోషల్ మీడియా పేజీ లో తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. “మా గుండెలు బాధతో బరువెక్కాయి. మా కుటుంబమంతా కలిసి మా గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా గారికి చివరిసారిగా గుడ్ బై చెప్పాం. ఆమె చాలా ధైర్యవంతురాలు. మాపై ఆమె ప్రభావం చాలానే ఉంటుంది. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉండిపోతాయి. ఓం శాంతి” అంటూ పేర్కొంది రష్మీ.

జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న రష్మీ..అప్పుడప్పుడు వెండితెర ఫై కూడా కనిపిస్తూ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రష్మీ…బుల్లితెర ఫై విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. ఈ పాపులార్టీ తో ఆమెకు సినిమా ఛాన్సులు వస్తూ ఉన్నాయి. హీరోయిన్ గా పలు సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది.