వీరసింహ రెడ్డి డైరెక్టర్ కు చిరంజీవి గిఫ్ట్..

వీర సింహ రెడ్డి మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి ..వాల్తేర్ వీరయ్య మూవీ లో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి ఓ ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. అదేంటి వాల్తేర్ వీరయ్య చిత్రాన్ని డైరెక్ట్ చేసింది బాబీ కదా..ఇస్తా ఆయనకు ఇవ్వాలి కానీ గోపీచంద్ కు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

సంక్రాంతి బరిలో వచ్చిన వీర సింహ రెడ్డి , వాల్తేర్ వీరయ్య రెండు చిత్రాలు కూడా భారీ విజయాలు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. మొదటి వారం పూర్తి అయ్యేలోపే ఈ రెండు చిత్రాలు వంద కోట్ల క్లబ్ ను దాటేశాయి. ప్రస్తుతం సక్సెస్ సంబరాల్లో ఉన్నారు రెండు సినిమా సభ్యులు. కాగా గోపీచంద్ మలినేని వరుస సక్సెస్ ఇంటర్వ్యూ లు ఇస్తూ అనేక విషయాలు షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా తనకు చిరంజీవి గిఫ్ట్ ఇచ్చిన విషయాన్నీ తెలిపారు. ‘నాకు రవి తేజగారికి పోలికలుంటాయి అని అందరూ అంటుంటారు. కొన్ని షాట్స్​ చేసేటప్పుడు రవితేజ అయితే నువ్వు నిలుచో నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లి పోయేవారు. అలానే చిరంజీవిగారు కూడా బక్క రవితేజ అని పిలిచేవారు. ఓసారి షూటింగ్ స్పాట్​లో ఉన్నప్పుడు నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్​ చిరంజీవి వచ్చారు. ఓ వాచ్​ తెప్పించి గిఫ్ట్​గా ఇచ్చారు. అప్పుడు చిరు.. ఇక నీ టైమ్​ బాగుంటుందని’ తెలిపినట్లు గోపీచంద్ చెప్పుకొచ్చారు.

ఇక రేపు వీర సింహ రెడ్డి సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సెలబ్రేషన్స్ కి బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుంది.