రామోజీ ఫిలింసిటీలో రామ్- బోయపాటి మూవీ షూటింగ్

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – రామ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇస్మార్ట్ శంకర్ తో అసలైన మాస్ హిట్ అందుకున్న రామ్..ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయిన రామ్.. ప్రస్తుతం ఆశలన్నీ బోయపాటి మూవీ పైనే పెట్టుకున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా రామ్..శ్రీలీల తో పాటు మిగిలిన తారాగణంపై ఫ్యామిలీ సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది. హీరో..హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా మలిచినట్లు తెలిసింది. బోయపాటి గత సినిమాల్లా కాకుండా ఇందులో కాస్త రొమాన్స్ ఘాటుగానే ఉంటుందని సమాచారం. సాధారణంగా బోయపాటి రొమాంటిక్ సన్నివేశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. కానీ పాన్ ఇండియా చిత్రం కావడంతో బోయపాటి కొన్ని నిబంధనలు పక్కనబెట్టి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రామ్ సరసన నాయికగా శ్రీలీల అలరించనుంది.ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది.