ఘోర రోడ్డు ప్ర‌మాదం : నలుగురు పోలీసులు సహా ఐదుగురు మృతి

జైపూర్‌ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు సహా మరో వ్యక్తి ఉన్నారు. నిందితుడిని ఢిల్లీ నుంచి గుజరాత్‌కు తీసుకువెళ్తున్న సమయంలో రాజస్థాన్‌లోని భబ్రూ ప్రాంతంలో పోలీసుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొట్టడంతో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు గుజరాత్‌కు చెందిన వారని ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/