తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.