బస్సు యాత్రకు సిద్ధమైన టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు సిద్ధమైంది. మరో నాల్గు , ఐదు నెలల్లో తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. ఎలాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తుంది. రీసెంట్ గా ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించి ప్రజల్లో ఆసక్తి రేపిన కాంగ్రెస్..ఇప్పుడు బస్సు యాత్ర తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. వచ్చే నెల మొదటి వారం నుంచే యాత్రను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ముందు జరుగుతున్న బస్సుయాత్రలో…పార్టీ కీలక నేతలంతా పాల్గొననున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సుయాత్రలో ఆరు గ్యారంటీ పథకాలను… ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు నేతలు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్‌ మొదటి వారంలోనే యాత్ర మొదలు పెట్టి 10–12 రోజుల్లోనే…వీలయినన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. బస్సుయాత్ర రూట్‌మ్యాప్, షెడ్యూల్‌ను…రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.