విజయవాడ లో ఘోరం : టీసీ కావాలంటే కోరిక తీర్చలేసిందే అంటూ విద్యార్థినులను బెదిరించిన ప్రిన్సిపాల్

మంచి బుద్ధులు నేర్పించాల్సిన గురువులే..కామాంధులుగా మారుతున్నారు. కామ కోరిక తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కోర్ట్ లు , పోలీసులు ఎంతటి కఠిన శిక్షలు విధిస్తున్న ఏమాత్రం భయం కానీ , మార్పు కానీ జరగడం లేదు. తాజాగా విజయవాడ లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కోరికలు తీరుస్తేనే టీసీ ఇస్తానంటు విద్యార్థినులను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

అంబాపురంలో నవోదయ పారా మెడికల్ కళాశాల విద్యార్థులపై ప్రిన్సిపాల్ రవీంద్రరెడ్డి కోరికలు తీర్చాలంటూ బెదిరింపులకు గురిచేశాడు. విద్యాభ్యాసం ముగియడంతో టీసీలు తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులను వేధించాడు. రాత్రి సమయాల్లో వాట్సాప్లో అసభ్య మెస్సేజ్‌లు పెట్టేవాడని విద్యార్థులు ఆరోపించారు. తన కోరికలను తీరిస్తేనే టీసీలు ఇస్తానని బెదిరించినట్లు విద్యార్దునులు వాపోయారు. ఈ లైంగిక ఆరోపణలతో చాలామంది విద్యార్థులు హాస్టల్ కూడా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో చైల్డ్ లైన్ అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం నవోదయా పారామెడికల్ హాస్టల్‎లో విచారణ చేసి స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లారు. అలాగే హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థినులను కూడా విచారించనున్నారు. ఈ వ్యవహారంపై పైఅధికారులకు రిపోర్ట్ ఇవ్వనున్నారు.