నేటి నుండి జాతీయ యువజన కాంగ్రెస్ సమావేశాలు
నేటి నుండి హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జాతీయ యువజన కాంగ్రెస్ సమావేశాలు జరగనున్నాయి. నగరంలోని క్షత్రియ హోటల్లో ఈ సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి నేతృత్వంలో జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ సమావేశాలకు 29 రాష్ట్రాల నుంచి 7 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు. అలాగే యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధానకార్యదర్శులు, కార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్రావ్ ఠాక్రే స్పెషల్ గెస్టులుగా హాజరుకానున్నారు. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలల్లో యువజన కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.