భారత్లో గత 24 గంటల్లో 3,390 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యా ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. కాగా గత 24 గంటంలో 1273 మంది కరోనా నుండి కోలుకున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో కరోనా రికవరీ రేటు 29.36 శాతంగా ఉంది. 216 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కావడం లేదని లవ్ అగర్వాల్ తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/