Telangana Polls : ప్రజాశాంతి పార్టీ ఫస్ట్ లిస్ట్
తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ సైతం బరిలోకి దిగబోతున్నట్లు తెలిపిన ఆ పార్టీ అధ్యక్షుడు KA పాల్ ..సోమవారం ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసారు.12మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసిన పాల్… రేపు రెండో జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో KA పాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తనదైన ప్రచార శైలితో హల్చల్ చేసి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.
ఇక మొదటి విడత లిస్ట్ లోని అభ్యర్థులను చూస్తే..
- చెన్నూరు- మొయ్య రాంబాబు
- జుక్కల్ (ఎస్సీ) – కర్రోల్ల మోహన్
- రామగుండం – బంగారు కనకరాజు
- వేములవాడ- అజ్మీరా రమేష్ బాబు
- నర్సాపురం- సిరిపురం బాబు
- జహీరాబాద్ – బేగరి దశరథ
- గజ్వేల్- పాండు
- ఉప్పల్ – కందూరు అనిల్ కుమార్
- యాకుత్ పురా- సిల్లివేరు నరేష్
- కల్వకుర్తి – కట్టా జంగయ్య
- నకిరెకల్ -కదిర కిరణ్ కుమార్
- మధిర – కొప్పుల శ్రీనివాస్ రావు