కరోనా బారిన పడిన పోసాని..హాస్పటల్ కు తరలింపు

సినీ నటుడు , ఆంధ్ర ప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మూడోసారి కరోనా బారినపడ్డారు. పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని గురువారం హైదరాబాదుకు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే 10 వేలు దాటాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,42,10,127కి చేరుకుంది. 19 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.