సొంత ఊరికి సీజేఐ..ఘన స్వాగతం పలికిన స్థానికులు

పొన్నవరం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు ఏపీ అధికారులు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరంలో వచ్చారు. ఎన్వీ రమణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.. సీజే దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా మేళతాళాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల పౌరసన్మాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటూ ఏపీలో ఎన్వీ రమణ పర్యటించనున్నారు. శనివారం జగన్ సర్కార్ తేనీటి విందు ఏర్పాట్లు చేసింది. సీజేఐ హోదాలో ఎన్వీ రమణ, సీఎం హోదాలో జగన్ ఓకే వేదికపైకి రానున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/