ఫస్ట్ టైం గాంధీ భవన్ లో అడుగుపెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత మొదటిసారి గాంధీ భవన్ లో అడుగుపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన పొంగులేటి..రీసెంట్ గా ఖమ్మం సభ లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. పొంగులేటి వంటి బలమైన నాయకుడు కాంగ్రెస్ లో చేరడం పార్టీ కి మరింత బలాన్ని పెంచినట్లు అయ్యిందని అంత భావిస్తున్నారు.

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి మంగళవారం గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. పొంగులేటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పూలబొకే ఇచ్చి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్‌లో చేరిన తరువాత ఫస్ట్ టైం పొంగులేటి గాంధీభవన్‌కు రావడంతో సందడి నెలకొంది. ఆయనతో పాటు పలువురు నేతలు గాంధీభవన్‌కు వచ్చారు. అనంతరం రేవంత్‌రెడ్డితో పాటు పొంగులేటి భేటీ అయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల కోసం పార్టీని ఎలా మందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది.