మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌!

Polling ended in Maoist-affected areas!

హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్‌, బెల్లంప‌ల్లి, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, అశ్వ‌రావుపేట‌, ములుగులో క‌డా 4 గంట‌ల‌కే పోలింగ్ పూర్త‌యింది. అయితే, అప్ప‌టికే క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అధికారులు అవ‌కాశం ఇస్తున్నారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ కొన‌సాగుతోంది.