ఆవాస్ యోజ‌న కార్యక్రమంలో ప్రధాని మోడీ

YouTube video
PM Shri Narendra Modi inaugurates Azadi @75 conference & expo in Lucknow, Uttar Pradesh.

లక్నో : ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద నిర్మించిన 75వేల ఇళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లబ్ధిదారులకు అందజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు వర్చువల్‌ ద్వారా ఇంటి తాళాల‌ను అందించారు. ఆ త‌ర్వాత వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ల‌బ్ధిదారుల‌తో సంభాషించారు. ల‌క్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బన్‌ ల్యాండ్‌స్కేప్ ఎక్స్‌పోను మంగళవారం నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్నోకు చేరుకుని ప్రారంభించారు. ఈ కార్యక్రంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్ ప‌టేల్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజ‌న కింద యూపీలో 17.3 లక్షల ఇళ్లను ఇప్పటివరకు మంజూరుచేశారు. 8.8 ల‌క్షల మంది ల‌బ్ధిదారుల‌కు ఇళ్లను అంద‌జేసిన‌ట్లు ప్రధాని మోడీ తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేదల ఖాతాల్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలను బదిలీ చేసిందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అయితే.. మూడు కోట్ల కుటుంబాలు ఆవాస్‌ యోజన పథకం ద్వారా లక్షాధికారులు అయ్యే అవకాశం వచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో దాదాపు 3 కోట్ల ఇళ్లు నిర్మించినట్లు వెల్లడించారు. వీటిద్వారా ఎన్నికోట్లు కేటాయించామో ఊహించుకోవచ్చంటూ పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/