నేడు అసోంలో ‘వందే భారత్’ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోడీ
గువాహటి, న్యూజల్పైగురి మధ్య పరుగులు పెట్టనున్న రైలు
న్యూఢిల్లీః అసోం ఈరోజు తొలి వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ గువాహటి, న్యూజల్పైగురి మార్గంలో వందేభారత్ను వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు కల్పించే క్రమంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను లాంఛ్ చేయనున్నారు.
వర్చువల్గా జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని, బొంబైగావ్-దుద్నోయ్-మెండిపతేర్, గౌహతి-చాపర్ముఖ్ కొత్తగా విద్యుద్దీకరించిన రైలు మార్గాలనూ జాతికి అంకితమిస్తారు. వందేభారత్ రైల్లో గువాహటి నుంచి 411 కిలోమీటర్ల దూరంలోని న్యూజల్పైగురికి కేవలం అయిదున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ సర్వీసును వారానికి ఐదు రోజులు నడుపుతామని అధికారులు చెప్పారు.