స్కాట్లాండ్‌లో డ్రమ్స్ వాయిస్తూ మోడీ సందడి

గ్లాస్గో : భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం గ్లాస్గోలో జరిగిన కాప్‌-26 (COP26) మీట్‌లో మోడీ పాల్గొన్నారు. ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం మోడీ ఇండియాకు బయ‌ల్దేరే ముందు భార‌తీయులు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో మోడీ బస చేసిన ఓ హోటల్ వద్దకు భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన హోటల్ నుంచి బయటికి రాగానే వీరందరితోనూ ఆత్మీయంగా మాట్లాడారు. చాలా మంది బాలలతో కరచాలనం చేసి, మాట్లాడారు. విమానాశ్రయం వద్ద కూడా భారత సంతతి ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికారు. డ్రమ్స్ వాయించి సందడి చేశారు. మోడీ కూడా వారితో కలిసి ఓ డ్రమ్ వాయించి సందడి చేశారు.

గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్‌-26 (COP26) మీట్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమైన విష‌యం తెలిసిందే. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26) 26వ సెషన్‌లో పాల్గొన్న ప్రధాని మోడీ పలు దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రజా సంబంధాలపై మాట్లాడారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/