మాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు
జేపీ నడ్డా జీ.. ఈ ఎన్నికలో మాపై నమ్మకం ఉంచారు..ఈటల
హైదరాబాద్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన ఈటల రాజేందర్ తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
‘జేపీ నడ్డా జీ.. ఈ ఎన్నికలో మాపై నమ్మకం ఉంచి, మాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు. ప్రధాని మోడీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నిబద్ధతతో పని చేసేందుకు మీ సూచనలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము’ అని ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/