తిరుమ శ్రీవారి సేవలో ప్రధాని మోదీ
తిరుమల: ప్రధాని మోడీ ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్న మోదీ.. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రధానికి అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని మోడీ ఆలయంలో గడిపారు. కాగా, ప్రధాని హోదాలో మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి.