అందుకే ట్విట్టర్ లో గవర్నర్ ను బ్లాక్ చేశా : మమతా బెనర్జీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ ట్వీట్లు పెడుతున్నారంటూ ఆరోపణ

blocked-governor-on-twitter-mamata-banerjee
blocked-governor-on-twitter-mamata-banerjee

Koltaka: గవర్నర్‌ పోస్టులతో తానూ విసిగిపోయానని అందుకే ట్విట్టర్ లో గవర్నర్ ను బ్లాక్ చేశానని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఇదిలా ఉండగా , పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ మధ్య వార్‌ కొనసాగుతూ వస్తోంది. కాగా గవర్నర్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ ట్వీట్లు పెడుతున్నారని, గవర్నర్ పోస్టులతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు . బెంగాల్ గవర్నర్ తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని బెదిరిస్తున్నారని ఆరోపించారు . తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ గవర్నర్ పై మమతా బెనర్జీ ఆరోపించారు. గవర్నర్ ఇంటి నుంచే పెగాసస్ నడుస్తోందని మమతా తీవ్రంగా ఆరోపించారు.

వాణిజ్య (బిజినెస్) వార్తల కోసం: https://www.vaartha.com/news/business/