మరికాసేపట్లో నిజామాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ

pm-modi-nizamabad-tour

హైదరాబాద్‌ః నేడు నిజామాబాద్ పర్యటనకు ప్రధాని మోడీ రానున్నారు. ప్రధాని పర్యటనలో మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైలు మార్గం ప్రారంభిస్తారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూలు మార్గాల విద్యుదీకరణను జాతికి అంకితం చేయనున్నారు.

మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో రైతులు భారీ సంఖ్యలో ఇందూరు బహిరంగ సభకు తరలివస్తున్నారు. గ్రామాల్లో రైతులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో పసుపు రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. మహిళా బిల్లుపై కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలు కూడా పెద్దు ఎత్తున తరలివస్తున్నారు.