మళ్ళీ పెరిగిన చమురు ధరలు..

న్యూఢిల్లీ: నేడు కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈరోజు పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.114.5, డీజిల్ ధర రూ.100.69కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 101.05, డీజిల్ ధర రూ.92.31కు చేరింది. బెంగళూరు ధర రూ.106.44, డీజిల్ ధర రూ.90.47గా నమోదైంది. చెన్నై పెట్రోల్ రూ.106.68, డీజిల్ ధర రూ.96.74కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/